ముఖ్యంగా.. ధోనీతో పాటు కోహ్లీ, రోహిత్, ధావన్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ధోనీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ధోనీకి కూడా విశ్రాంతినివ్వొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి.
అందుకే కోహ్లీ, రోహిత్, ధావన్లతో పాటు.. ధోనీకి కూడా విశ్రాంతినిచ్చి ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసి జింబాబ్వేకు పంపాలన్న ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, జట్టులో కొనసాగాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారం ధోనీకే వదిలేయాలని నిర్ణయించారు.