ఓ మహిళా వైద్యురాలు అత్యాచారానికి గురయ్యారు. పెళ్లి పేరుతో నమ్మించి హోటల్కు పిలిపించిన ఓ కామాంధుడు.. తన కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోకి బంజారాహిల్స్ ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో ఓ మహిళ వైద్యురాలిగా పనిచేస్తుంది. ఆమెకు పాలమూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు డాక్టర్ స్వామితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొంతకాలానికి పెళ్ళి ప్రస్తావన వరకు దారితీసింది. ఈ క్రమంలో, ఈ యేడాది జనవరి నెలలో బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని డాక్టర్ స్వామి నమ్మించాడు.
ఆ తర్వాత సదరు వైద్యురాలిని హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న ఓ హోటల్కు పిలిపించి, మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోని తెగేసి చెప్పాడు. దీంతో పెళ్లి పేరుతో తనను మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడని గ్రహించిన మహిళా వైద్యురాలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.