దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నవీ ముంబైలో దారుణం జరిగింది. ఓ టీనేజి అమ్మాయి తల్లిని కిరాతకంగా హత్య చేసింది. అయిరోలీ ప్రాంతంలో నివసించే 15 ఏళ్ల అమ్మాయి నీట్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. అయితే ఆ అమ్మాయిని చదవాలంటూ తల్లి పదేపదే ఒత్తిడి చేస్తూ వచ్చేది. దాంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
అనంతరం తల్లి ఫోన్ నుంచి తండ్రికి, మేనమామకు, ఇతర బంధువులకు వాట్సాప్ చేసింది. గదిలోకి వెళ్లిన తల్లి తలుపు తీయడంలేదని వెల్లడించింది. ఆమె మేనమామ వచ్చి చూసే సరికి ఆ మహిళ అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది.
సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. దాంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలిక మైనర్ కావడంతో జువెనైల్ హోంకు తరలించారు. మొదట ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం తర్వాత మరింత లోతుగా దర్యాప్తు జరపగా బాలిక తన నేరాన్ని అంగీకరించింది.