హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ అత్తాపూర్లో దారుణం జరిగింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి, మాట్లాడుకుందామని చెప్పి లాడ్జికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక రాష్ట్రంలోని ఉమ్నాబాద్ ప్రాంతానికి చెందిన వీరయ్య ఇటీవలే హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో తమ బంధువు పెళ్లి వేడుకకి హాజరయ్యాడు. ఆ వివాహ వేడుకలో అతడు ఓ యువతిపై కన్నేసాడు.
మెల్లగా ఆమెతో మాటలు కలిపి ప్రేమిస్తున్నాననీ, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెతో ఫోనులో తరచూ సంభాషించడం ప్రారంభించాడు. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ వచ్చి యుతికి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచాడు. అలా ఆమెను ఓ లాడ్జికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసాడు.