పాతబస్తీ మంగళ్‌హాట్‌లో మరో బాలికపై అత్యాచారం...

గురువారం, 16 సెప్టెంబరు 2021 (13:54 IST)
హైదరాబాద్ నగరంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. ఈ ఘటనలో నిందితుడిని ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలో తాజాగా పాత‌బ‌స్తీలోని మంగ‌ళ్‌హాట్ ప‌రిధిలో బాలిక‌పై బుధవారం రాత్రి అత్యాచారం జ‌రిగింది. 
 
రాత్రి 11 గంట‌ల‌కు సుమిత్ అనే యువ‌కుడు తొమ్మిదేండ్ల బాలిక‌ను నిర్మానుష్య ప్ర‌దేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక అరుపుల‌తో స్థానికులు అక్క‌డికి వెళ్లి.. సుమిత్‌ను చితకబాది అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆ కామాంధుడిని పోలీసుల‌కు అప్ప‌గించారు. హ‌బీబ్‌న‌గ‌ర్ ప‌రిధిలో న‌మోదైన ఓ చోరీ కేసులో సుమిత్ నిందితుడిగా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. బాలిక‌ను భ‌రోసా సెంట‌ర్‌కు త‌ర‌లించి, అనంత‌రం వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆమెను కోఠిలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు