హర్యానా రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ను తుపాకీ కాల్చి చంపిన ఆమె తండ్రి ఇపుడు పశ్చాత్తాపడుతున్నాడు. తాను చేసిన పనికి ఉరిశిక్ష పడేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రాధేయపడుతున్నారు. పైగా, ఆవేశంలో హత్య చేసిన దీపక్ ఇపుడు కుమిలిపోతున్నడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ ఘటనపై నిందితుడు దీపక్ సోదరుడు విజయ్ మీడియాతో మాట్లాడుతూ, "హత్య చేయడం చాలా పెద్ద తప్పిదం. దీపకన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. తనను ఉరితీసే విధంగా ఎఫ్ఎఆర్ రాయండని కూడా పోలీసులకు చెప్పాడు. ఆడపిల్లను చంపేశానని రోదించాడు" అని విజయ్ వెల్లడించారు.