భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

ఠాగూర్

గురువారం, 22 మే 2025 (08:23 IST)
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మైనర్ బాలుడుని ఓ వ్యక్తి చంపేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో గులాబీ నగర్ ప్రాంతంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... 
 
ఈ నెల 19, 20 తేదీల మధ్య రాత్రి సమయంలో ముఖేష్ ఠాకూర్, మృతుడు జతిన్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత జతిన్ తన భార్య సుధతో అసభ్యకరమైన స్థితిలో ఉండగా ముఖేశ్ చూశాడని పోలీసులు వెల్లడించారు. మరుసటి రోజు ఉదయం సుధ రోషనాలాలోని ఓ బొమ్మల ఫ్యాక్టరీకి పనికి వెళ్లిన తర్వాత ముఖేష్, జతిన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ముఖేష్, ఇంట్లోని చిన్న గ్యాస్ సిలిండర్‌ను తీసుకుని జతిన్ తలపై పలుమార్లు బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుడు జతిన్ ముఖేష్ భార్య సుధకు తెలిసిన వ్యక్తి ద్వారా వారి ఇంట్లో అద్దెకు దిగాడు. 
 
ఈ హత్య తర్వాత ముఖేష్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముఖేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు