ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఠాగూర్

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (08:32 IST)
ఢిల్లీ విమానాశ్రయంలో వజ్రాలు పొదిగిన అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెక్లెస్‌ను ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ నెక్లెస్ విలువ రూ.6 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తమ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 
 
ఈ నెల 12వ తేదీన బ్యాంకాక్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతను అత్యంత ఖరీదైన ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. వజ్రాలు పొదిగిన 40 గ్రాముల ఈ నెక్లెస్ విలువ సుమారు రూ.6.08 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడు గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 


 

???? Man Arrested by Customs for Smuggling Diamond Necklace worth Rs 6.08 Crores at IGI Airport, New Delhi ‼️

On the basis of profiling, the officers of Customs, IGI Airport, New Delhi have booked a case of smuggling of gold necklace studded with diamonds, on 12.02.2025 against… pic.twitter.com/MjTqNH2hWF

— Delhi Customs (Airport & General) (@AirportGenCus) February 16, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు