బ్లడ్ బ్యాంకు ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధిత విద్యార్థినులు గుంటూరు వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుందరాచారికి ఫిర్యాదు చేశారు. అయిన వెంటనే స్పందించి ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా సదరు బ్లడ్ బ్యాంకు ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోనున్నారు.