కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కామర్హతిలోని ఈఎస్ఐ క్వార్టర్స్లో రెండవ సంవత్సరం వైద్య విద్యార్థిని తన గదిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. విద్యార్థి తల్లి పదే పదే తలుపు తట్టినప్పటికీ స్పందన రాలేదు. ఆమె తాళాలు పగులగొట్టి గదిలోకి చూడగా, తన కూతురు వేలాడుతూ కనిపించింది.
స్థానికుల సహాయంతో, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
అయితే, ప్రాథమిక విచారణలో విద్యార్థిని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని, అది నిరాశకు దారితీసి ఉండవచ్చు, ఇది చివరికి ఆమె ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని సూచిస్తున్నాయి.