సమాజంలోని కొందరు కామాంధులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. నిండు అంధురాలైన ఓ యువతిపై వరుసకు మామ అయ్యే ఓ కామమృగం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లాలోని పలాస మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలికి అదే గ్రామానికి చెందిన వరిశ భాస్కరరావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పేవాడు. మామ వరసయిన అతడు 7 నెలల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్దని నిరాకరించినా కల్ల బొల్లి మాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఇందులో తన తప్పు లేదని భాస్కరరావు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆదివారం బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కరరావు తనను గర్భవతిని చేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.