భార్యకు ఆస్తినంతా అప్పగిస్తే ఆ పని చేసింది

గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:04 IST)
భార్యను ఎంతగానో నమ్మాడు. ఆమే సర్వస్వం అనుకున్నాడు. తన పేర మీద ఉన్న ఆస్తులన్నింటినీ ఆమె పేరు మీదకు మార్చాడు. ఆమె చెప్పిందే వినేవాడు. కానీ ఆమె మాత్రం తన భర్తను మోసం చేసింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన భార్య వేరొకరితో కలిసి ఉంటోందని భావించిన భర్త అనుమానపడ్డాడు. లోలోపల మథనపడిపోయాడు. చివరకు..

 
యుపీలోని గోండాలో ప్రవీణ్ కుమార్ నివాసముంటున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ కుమార్ బాగా ఆస్తిపరుడు. కానీ పిల్లలు లేరు. తన భార్య బాగా చదువుకుంది. కానీ ఇంటి దగ్గరే ఉండేది. భార్య అంటే ప్రవీణ్ కుమార్‌కు ఎంతో ఇష్టం. అందుకే తన పేర మీద ఉన్న ఆస్తులు మొత్తాన్ని ఆమె పేరు మీదకు మార్చాడు. తాను నిర్వహిస్తోన్న కంపెనీలోను భార్యను భాగస్వామ్యురాలిగా చేశాడు. అదే అతను చేసిన తప్పని ఆ తరువాత తెలుసుకున్నాడు.

 
భార్యను స్వేచ్ఛగా వదిలేయడం.. ఆస్తి మొత్తం ఆమె చేతిలోనే ఉండిపోవడంతో ఆమె పాత బాయ్‌ఫ్రెండ్ లైన్లోకి వచ్చేసాడు. అతనికి కావాల్సినంత డబ్బులు అప్పుడప్పుడు ఇస్తూ ఉండేది. భర్తకు అనుమానం వచ్చింది. భార్యను ప్రశ్నిస్తే ఏమనుకుంటుదేమో అనుకున్నాడు. లోలోపల బాగా మథనపడిపోయాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. విషయాన్ని డైరెక్టుగా భార్యనే అడిగేశాడు. అంతే... ఇక తనను భర్త విడిచిపెట్టడని అనుమానపడిన భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోస్టుమార్టంలో బయటపడి కటాకటాల పాలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు