బాపట్ల రైల్వే స్టేషను సమీపంలో విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ ప్రైవేట్ రిజర్వేషన్ కౌంటర్ నడుపుతున్నాడు. ఈయనతో ఓ మహిళ గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం వున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు మహిళ ఈరోజు మధ్యాహ్నం కౌంటరు వద్దకు వచ్చి నారాయణతో గొడవకు దిగింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ నిలదీసింది. మాటామాటా పెరిగి చిన్న వాగ్వాదానికి దారి తీసింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత మహిళ తన శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది.
అనంతరం మంటలు చెలరేగుతుండగా నాతోపాటే నీవు కూడా చద్దువుకాని రా అంటూ అతడిని వాటేసుకుంది. దీనితో ఇద్దరికీ మంటలు వ్యాపించాయి. నారాయణ తనను రక్షించాలంటూ కేకలు వేయడంతో స్థానికులు వెంటనే మంటలను ఆర్పేసారు. ఐతే బాధితురాలికి శరీరం 50 శాతానికి పైగా కాలిపోయినట్లు సమాచారం. నారాయణకు 30 శాతానికి పైగా శరీరం కాలినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.