అంతర్జాతీయ మత్తు పానీయాల వ్యతిరేక దినం సందర్భంగా వరంగల్లో వినూత్న రీతిలో స్వచ్ఛంద సంస్థలు ఓ ర్యాలీ నిర్వహించాయి. మత్తు పానీయాలు సేవించడం వలన వచ్చే నష్టాలను ర్యాలీలో ప్రదర్శనగా చేసి చూపారు. ప్రదర్శన అనంతరం హెల్పింగ్ హైండ్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ కలెక్టరుకు వినతి పత్రం సమర్పించింది.
వివిధ రూపాలలో మనిషి ఆరోగ్యాన్ని కబళిస్తున్న మత్తు పానీయాలను సేవిస్తే... మరణాన్ని కొని తెచ్చుకోవటమేనని పలువురు పేర్కొన్నారు. జీవితంలో ఏ ఒక్కరూ వాటికి చోటివ్వరాదని పిలుపునిచ్చారు.