కుక్కర్‌లో వండిన అన్నం ఆరగిస్తున్నారా?

బుధవారం, 6 నవంబరు 2019 (11:50 IST)
ఈ హైటెక్ ప్రపంచంలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వ్యక్తి జీవితం ఎలక్ట్రిక్ మయంగా మారిపోయింది. ఇప్పటికే సెల్‌ఫోన్ చేతిలో లేనిదే మనిషి జీవనం గడపలేని పరిస్థితి నెలకొంది. అలాగే, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు కూడా. 
 
వేడినీళ్ల దగ్గర్నుంచి.. తాగే వాటర్, తినే పుడ్ కూడా ఇప్పుడు కరెంట్ ద్వారానే. తాగే నీరు కూడా వాటర్ హీటర్‌లో వేడి చేస్తున్నారు. అలాగే, అన్నం కూడా రైస్ కుక్కర్‌లోనే వండుతున్నారు. ఈ పరిస్థితులన్నీ మనుషుల ఆరోగ్యాలకి హానికరంగా మారాయి. 
 
అయితే, రైస్ కుక్కర్‌లో వండిన అన్న విషతుల్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఉంది. రైస్ కుక్కర్లు అన్ని అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాదు.
 
ఆహారం వండేటప్పుడు గాలి వెలుతురు తగులుతూ ఉండాలి. ఆలా లేకపోతే ఆహారం విషంగా మారుతుంది. ఈ విషాలలో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది తక్షణమే పనిచేస్తుంది. దీనిని ఫుడ్ పాయిజిన్ అని అంటారు. 
 
మరొకటి శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయట పడుతుంది. ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ రైస్ కుక్కర్‌లో అన్నం వండేటప్పుడు గాలి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితిలోను ఉండదు. దీంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.
 
అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
 
ఉదర సంబంద సమస్యలు
గుండె సంబందిత సమస్యలు
కీళ్ల వాతం
మధుమేహం
గ్యాస్ సమస్యలు
అధిక బరువు
నడుము నొప్పి వంటి రోగాల బారినపడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు