రాగిమాల్ట్‌తో కిడ్నీలో రాళ్లు మటాష్...

గురువారం, 26 జులై 2018 (12:37 IST)
రాగుల్లో పోషకాలు అంతా ఇంతా కాదు. రాగులు ఆరోగ్యానికి శక్తినిస్తాయి. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. ముఖ్యందా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. రాగుల వల్ల జుట్టు వత్తుగా పెరుగుతాయి. 
 
రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
 
రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది. రాగులు కడుపులో మంటను తగ్గిస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. వృద్ధులు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు