కదలకుండా 8 నుంచి 9 గంటల పాటు పనిచేస్తూ.. ఒత్తిడికి గురయ్యేవాళ్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. అలాంటివాళ్లు భోజనం చేశాక అరగంట తరవాత టీస్పూను వాము, కాస్త అల్లం కలిపిన టీ తాగితే ఫలితం ఉంటుంది. తేన్పులు, కడుపులో మంటను దూరం చేసుకోవచ్చు.
అంతేగాకుండా ఛమేలీ టీని రోజుకు మూడు నుంచి నాలుగు కప్పులు తీసుకుంటే.. నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. ఒత్తిడిని నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే.. బ్లాక్ టీని రోజుకు రెండుసార్లు తాగడం ద్వారా ఒత్తిడిని తగ్గించే హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఇక ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లలో గ్రీన్టీలోని కెటెచిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో కాస్త తేనె, నిమ్మరసం కూడా కలిపితే మరింత ఫలితం ఉంటుంది.