దోసకాయ, నిమ్మరసం ప్యాక్తో చర్మానికి ఎంతో మేలు చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి.. బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేయడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా చర్మకణాల నిర్మాణాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. దోసకాయ రసాన్ని నిమ్మతో కలిపి ముఖానికి పట్టించడం ద్వారా కూడా చర్మం మెరిసిపోతుంది.
జిడ్డు, నల్లటి వలయాలు తగ్గాలంటే.. బంగాళదుంపను ఉపయోగించాలి. ముఖ్యంగా, జిడ్డు చర్మాన్ని కలిగి ఉన్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళదుంప రసాన్ని చర్మానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది.