సీతాఫలం తింటే జుట్టు నల్లగా మెరిసిపోతుంది...!!

సోమవారం, 11 జులై 2016 (21:08 IST)
సీతాఫలం దాదాపు అన్ని దేశాల్లో విరివిగా దొరికే పండు. ఈ పండును సీజన్‌ ఉన్నంత వరకు తప్పకుండా తింటుంటే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి, చలికాలంలో ఎక్కువగా దొరికుతుంది.ఈ పండును సీజన్ ముగిసేంత దాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమే కాకుండా ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది. సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. 
 
వాంతులు, తలనొప్పి విరుగుడుగా, చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇది పిల్లల ఎదుగుదల, ఎముకల పుష్టిని కలిగిస్తుంది. ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది. కుదుళ్లకు దృఢత్వానిస్తుంది. పేగుల్లో ఉండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్ని ఇస్తుంది. త్రిదోష నివారిణిగా శరీరంలో ఉండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.
 
ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల వరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాములు, విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ నాలుగు శాతం, సోడియం పది మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను  తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది. ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతం అవుతాయి. బలహీనత, సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి