ఉదయం పూట 6 గంటలకు గ్లాసు పాలు లేదంటే రాగి జావ తీసుకోవాలి. ఉదయం 8 గంటలకు 4 ఇడ్లీలు లేదంటే దానికి సమానమైన బ్రేక్ ఫాస్ట్ ఏదైనా. 10 గంటలకు పండ్లు లేదా ఓ గ్లాసుడు పండ్ల రసం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు 2 కప్పుల అన్నం, కప్పు ఆకు కూర, కప్పు కూర, కప్పు పెరుగు, పచ్చి కూరగాయలు తీసుకోవాలి. సాయంత్రం 4 గంటలకు కప్పు టీ లేదా మొలకెత్తిన శెనగలు కానీ పెసలు కానీ తీసుకోవాలి.
రాత్రి 8 గంటలకు 2 చపాతీలు, అన్నం, పప్పు, రసం తీసుకోవచ్చు. రాత్రి 10 గంటలకు గ్లాసు పాలు తీసుకోవాలి. ఇది సంపూర్ణ ఆహారం చిట్టా. ఐతే ఏ పని చేయకుండా తినడమే పనిగా పెట్టుకుంటే కొవ్వు పేరుకుపోయి సమస్య తలెత్తవచ్చు. కాబట్టి వ్యాయామం కూడా తప్పనిసరి.