Dr. L. V. Gangadhara Sastry at Sacramento City, USA
సనాతన ధర్మం ఒక వర్గానికి మాత్రమే పరిమితమయ్యింది కాదనీ, ధర్మమంటే సార్వజనీనమైనదని, అందుకే భగవద్గీత ఐదువేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచ మానవాళికి స్ఫూర్తి నిచ్చే కర్తవ్యబోధా గ్రంథం గా ప్రాచుర్యం పొందిందని, నిత్య జీవితం లో 'భగవద్గీత అనుష్ఠానం' వల్ల సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన నీతి, శాంతి చేకూరుతాయని, గీత ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేoదుకు దోహదపడే కర్మసిద్ధాంత గ్రంథమ'ని గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి అన్నారు.