కావలసిన పదార్థాలు : ఉప్పుచేప... పావు కేజీ వంకాయలు... అర కేజీ కారంపొడి... 20 గ్రా. కొత్తిమీర... 2 కట్టలు ఉప్పు... తగినంత చింతపండు... 25 గ్రా. ఉల్లిపాయలు... నాలుగు పచ్చిమిర్చి... రెండు నూనె... వంద గ్రా.
తయారీ విధానం : చింతపండును నానబెట్టి ఉంచాలి. ఉప్పుచేపను శుభ్రం చేసి ముక్కలుగా కోయాలి. మరో గిన్నెలో నీళ్ళుపోసి వంకాయల్ని తరిగి అందులో వేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను కూడా తరిగి ఉంచాలి. కొత్తిమీరను తరిగి ఉంచాలి.
స్టవ్పై బాణలిపెట్టి నూనె పోసి కాగాక, చేపముక్కలను వేసి ఎర్రగా వేయించాలి. తరువాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగులను కూడా వేసి కాసేపు వేయించి, ఆపై వంకాయ ముక్కలు, తగినంత ఉప్పువేసి వేసి బాగా మగ్గనివ్వాలి. పూర్తిగా మగ్గేలోపు చింతపండు పులుసును అందులో పోయాలి. కూర బాగా ఉడికి దగ్గరికి అయిన తరువాత పైన కొత్తిమీర చల్లి కలియబెట్టి, కాసేపటి తరువాత దించేయాలి. అంతే ఘుమఘుమలాడే ఉప్పుచేప వంకాయ కూర రెడీ...!