కావలసిన పదార్థాలు : మామిడికాయలు... అర కేజీ ధనియాలు... మూడు టీ. మినప్పప్పు... మూడు టీ. మెంతుల... అర టీ. కారం.. ఒక టీ. బెల్లం... 25 గ్రా. మంచినీరు... పావు కప్పు వెల్లుల్లి... 5 గ్రా. ఆవాలు... అర టీ. ఎండుమిర్చి... 10 గ్రా. కరివేపాకు... రెండు రెమ్మలు తెల్లనువ్వు... అర టీ. బియ్యం... అర టీ. రీఫైండ్ ఆయిల్... తగినంత కొత్తిమీర... కొద్దిగా ఉప్పు... తగినంత
తయారీ విధానం : ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, నువ్వులు, బియ్యం, మెంతులు... అన్నీ కొద్దిసేపు ఎండలోపెట్టి పొడి కొట్టుకోవాలి. మామిడికాయల్ని కడిగి పెద్దపెద్ద ముక్కలుగా కోయాలి. మట్టికుండలో కొద్దిగా నూనె పోసి చిదిమిన వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చితో పోపు పెట్టి అందులో మామిడికాయ ముక్కలు వేసి గరిటెతో కలపాలి. ముందే తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడి, కారం, బెల్లం, కొద్దిగా మంచినీళ్లు పోసి ఉడికించి దించాలి. దించే ముందు కొత్తిమీర చల్లితే మసాలా మామిడి కూర రెడీ...!