ముందుగా పెసరపప్పులో ఎక్కువ నీరు పోసి పలుకుగా ఉడికించి వార్చాలి. బంగాళాదుంపలను చెక్కుతీసి సన్నగా కట్చేసి హాఫ్బాయిల్డ్ చేసి ఉంచాలి. కాలీఫ్లవర్ను ఉప్పు కలిపిన నీటిలో వేసి శుభ్రంగా కడిగి ఉంచాలి. కాలీఫ్లవర్ను కూడా హాఫ్బాయిల్ చేసి ఉంచాలి. బాండీలో 2 చెంచాల నూనె వేసి వెజిటబుల్స్ అన్నింటిని వేసి దోరగా వేపుకోవాలి.
వేగిన వీటిని ప్రక్కన ఉంచాలి. మిగతా నూనెను వేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేపాలి. వేగిన వాటికి రవ్వ జతచేసి కలుపుతూ 2 నిమిషాలు వేపుకోవాలి. తరువాత మూడుకప్పుల నీరు, వేపిన ముక్కలు, పెసరపప్పు వేసి కలుపుతూ ఉడికించాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గరగా వచ్చిన తరువాత జాజికాయ పొడి, నిమ్మరసం పిండి దించి వేడి వేడిగా సర్వ్ చేయ్యాలి.