కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం... అర కేజీ ఫైనాపిల్ ముక్కలు... పావుకేజీ పంచదార... అరకేజీ నెయ్యి.. వంద గ్రా. పిస్తాపప్పు... 4 టీస్పూన్లు కుంకుమపువ్వు... అర టీస్పూన్
తయారీ విధానం : బాస్మతి బియ్యంతో అన్నం వండి పొడి పొడిగా వార్చుకోవాలి. పంచదారను ఓ గిన్నెలో వేసి పాకం పట్టి పక్కన ఉంచాలి. కేక్ను ఉడికించే గిన్నెలో ముందుగా.. కొద్దిగా అన్నం వేసి, పైన పైనాపిల్ ముక్కలను అమర్చి.. మళ్లీ పైన మరికొంత అన్నం అమర్చి, దానిపైన పంచదార పాకం పోసి, దానిపైన నెయ్యి కూడా చల్లి మూత పెట్టి, 200 డిగ్రీల సెంట్రీగ్రేడు వద్ద అరగంటసేపు బేక్ చేయాలి.
చల్లారిన తరువాత పై పదార్థాన్ని ముక్కలుగా కోసి, పైన పిస్తాపప్పు, కుంకుమపువ్వు చల్లి అతిథులకు సర్వ్ చేయండి. అంతే... తియ్యతియ్యగా సరికొత్తగా, కలర్ఫుల్గా కనిపించే ఫైనాపిల్ బాస్మతి ముజాఫిర్ సిద్ధమయినట్లే...! మాంచి రుచిగా ఉండే ఈ వంటకం చిన్నా, పెద్దా... అందరికీ బాగా నచ్చుతుంది. మీరూ ట్రై చేయండి మరి..!