కావలసిన పదార్థాలు : గోధుమపిండి... రెండు కప్పులు ఉప్పు... అర టీస్పూన్ నెయ్యి... ఒక టీస్పూన్
స్టఫింగ్ కోసం... పచ్చిబఠానీలు... ఒకటిన్నర కప్పు అల్లంముక్క... కొద్దిగా ఇంగువ... కొద్దిగా ఉప్పు... సరిపడా పచ్చిమిరపకాయలు... మూడు నూనె లేదా నెయ్యి... ఒక టీస్పూన్ నెయ్యి... పరాఠాలను వేయించేందుకు సరిపడా
తయారీ విధానం : ముందుగా పచ్చిబఠాణీలను కొద్దిగా నానబెట్టి, మిక్సీలో వేసి పేస్ట్లాగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కూడా పేస్ట్ చేసుకోవాలి. పెనంమీద నూనె లేదా నెయ్యి వేసి బఠానీల మిశ్రమానికి ఇంగువ, ఉప్పు చేర్చి మొత్తం మిశ్రమాన్ని వేయించుకోవాలి.
ఉప్పు, నెయ్యి, గోధుమపిండిని కొద్దిగా నీటిని కలిపి ముద్దగా చేసుకోవాలి. దీనిని చిన్న చిన్న ముద్దలుగా చేసి మధ్యలో బఠాణీల మిశ్రమాన్ని కూరి, అంచులు మూసేసి పరాఠాల్లాగా చేసుకోవాలి. తరువాత వీటిని పెనంమీద నెయ్యివేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే బఠానీ పరాఠాలు సిద్ధమైనట్లే...!