కావలసిన పదార్థాలు : బియ్యం... ఒక కప్పు ఉల్లిపాయ... ఒకటి గరం మసాలా... ఒక టీస్పూన్ పసుపు పొడి... పావు టీస్పూన్ నూనె... పావు కప్పు కొత్తిమీర తరుగు... కొద్దిగా మీల్ మేకర్స్... ఓ కప్పు వెల్లుల్లి రెబ్బలు... నాలుగు మిరపకాయ పొడి... ఒక టీస్పూన్ ఉప్పు... తగినంత నీళ్లు... రెండున్నర కప్పులు టమోటో స్లైసెస్... అలంకరణకు సరిపడా
తయారీ విధానం : మొదట బియ్యాన్ని బాగా శుభ్రం చేసి, నానబెట్టుకోవాలి. అలాగే మీల్మేకర్లను కూడా పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి. మైక్రోవేవ్ ఓవెన్లో ఒక పాత్రనుంచి అందులో నూనె పోసి, అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి చేర్చి రెండు నిమిషాల పాటు హై ఉష్ణోగ్రతలో ఉడికించాలి.
ఆతరువాత అందులోనే బియ్యం, మీల్మేకర్స్, ఉప్పు, గరం మసాలా పొడి, పసుపు పొడి, మిరపకాయ పొడి, సరిపడా నీటిని చేర్చి పదిహేను నిమిషాల పాటు హైలో ఉడికించాలి. అంతే మీల్మేకర్ మసాలా రైస్ రెడీ అయినట్లే...! సర్వింగ్ ప్లేట్స్లో ఈ రైస్ను సర్ది, టమోటో స్లైసెస్, కొత్తిమీర తరుగులతో అలంకరించి వేడి వేడిగా అతిథులకు అందించండి.