కావలసిన పదార్థాలు : గోధుమ పిండి... పావు కేజీ మెంతి కూర... ఒక కట్ట కొత్తిమీర... సగం కట్ట అల్లం... చిన్న ముక్క పచ్చిమిర్చి... నాలుగు కారం పొడి... సగం టీ. జీలకర్ర... పావు టీ. బెల్లంపొడి... సగం కప్పు పెరుగు... వంద గ్రా. నూనె... 50మి.లీ ఉప్పు... తగినంత
తయారీ విధానం : ముందుగా మెంతికూర, కొత్తిమీర ఆకులను సన్నగా తరగాలి. గోధుమ పిండిలో నూనె, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. దీనికి అన్ని మసాలా దినుసులు, తరిగిన మెంతికూర, కొత్తిమీరను కలపాలి. పెరుగులో బెల్లాన్ని వేసి పూర్తిగా కరిగేలా చేయాలి.
అన్నీ వేసిన గోధుమ పిండికి పెరుగు చేర్చి బాగా కలపాలి. అవసరమైతే కాసిని నీళ్ళు కూడా చల్లుకోవచ్చు. ఈ పిండిని ముద్దలుగా చేసుకుని ఒక్కోదాన్నీ చపాతీలా వత్తి కాల్చాలి. అంతే మేథీ తెప్లా రెడీ...!