పుట్టగొడుగుల పలావ్ ఇలా చేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే...

శనివారం, 8 జూన్ 2019 (19:17 IST)
ఆదివారం వస్తే మాంసాహార ప్రియులు చాలా రకాల మాంసాహారాలుంటాయి. కానీ శాఖాహారులు ఎప్పుడు తినే కూరగాయలే కదా అని అనుకోవద్దు. మాంసాహారం కన్నా కూడా శాఖాహారంతో అద్భుతమైన రుచితో మనం వంటలు చేసుకోవచ్చు. పుట్టగొడుగులతో పలావు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. శాఖాహారులకు పుట్టగొడుగులతో పలావు ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం- పావుకేజి,
పుట్టగొడుగులు- పావుకేజి,
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు,
నూనె- మూడు టేబుల్ స్పూన్లు,
ఉల్లిపాయ- ఒకటి,
పచ్చిమిర్చి- రెండు,
టమోటా- ఒకటి,
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టేబుల్ స్పూను,
పలావు మసాలా- ఒక టేబుల్ స్పూను,
పెరుగు- పావు కప్పు,
పలావు దినుసులు-తగినన్ని, 
కొత్తిమీర, పుదీనా- తగినంత,
ఉప్పు- సరిపడా,
 
తయారుచేయు విధానం:
ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నూనె వేడయ్యాక పలావు దినుసులు వేసి దోరగా వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. దానిలో పలావు మసాలా, పెరుగు, పుట్టగొడుగులు వేసి అయిదు నిమిషాలు వేగాక తగినన్ని నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేయాలి. నీళ్లు తెర్లేటప్పుడు బియ్యం వేయాలి. అన్నం ఉడకడం మొదలవగానే చిన్న మంటపై ఉంచి పూర్తిగా ఉడికినాక స్టవ్ ఆపెయ్యాలి. ఎంతో ఘుమఘుమలాడే పుట్టగొడుగుల బిర్యాని రెడీ. దీనిని కుర్మాతో తింటే టేస్టీగా వుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు