కావలసిన పదార్థాలు : అల్లం... వంద గ్రా. చింతపండు... వంద గ్రా. బెల్లంతరుగు... వంద గ్రా. ఎండుమిర్చి... పది ఉప్పు... తగినంత నూనె... ముప్పావు కప్పు మెంతులు... ఒక టీ. ధనియాలు.. రెండు టీ. జీలకర్ర.. ఒక టీ. ఆవాలు... ఒక టీ. కరివేపాకు... రెండు రెమ్మలు వెల్లుల్లి... పది రెబ్బలు నూనె... మూడు టీ.
తయారీ విధానం : పాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం ముక్కలను నాలుగు నిమిషాలపాటు వేయించి, చల్లారనివ్వాలి. వేడినీటిలో చింతపండు నానబెట్టి, చల్లారాక గుజ్జు తీయాలి. మళ్లీ పాన్లో రెండు టీస్పూన్ల నూనె వేసి మెంతులు వేయించాలి. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మరికాసేపు వేయించాలి. చల్లారిన తరువాత వీటిని పొడిచేసి పక్కనుంచాలి.
చల్లారిన ముక్కలను గ్రైండ్ చేసుకుని, చింతపండు గుజ్జు, బెల్లం తరుగు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీంట్లోనే గ్రైండ్ చేసిన మెంతి, ధనియాలపొడులను కలపాలి. పాన్లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపును పేస్ట్ చేసిన అల్లం పచ్చడిలో కలపాలి. దీనిని గాలి చొరబడని బాటిల్లో ఉంచి ఫ్రిజ్లో భద్రపరచాలి. ఈ పచ్చడి దోసె, ఇడ్లీ, అన్నంలలోకి చాలా రుచిగా ఉంటుంది.