కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు... అరకేజీ బఠాణీలు... అరకేజీ కొత్తిమీర తురుము... నాలుగు టీ. గరంమసాలా... రెండు టీ. మిరియాలపొడి... ఒక టీ. ఉప్పు... తగినంత నూనె లేదా నెయ్యి... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం : ఉడికించి పొట్టు తీసిన బంగాళాదుంపల్ని చిదిమి మెత్తగా మెదపాలి. బఠాణీల్ని కూడా అందులోనే వేసి కలపాలి. కొత్తిమీర, మసాలా పొడి, ఉప్పు అన్నీ వేసి కలిపి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. పెనంమీద కొద్ది కొద్దిగా నెయ్యి లేదా నూనె వేస్తూ వీటిని రెండువైపులా ఎర్రగా కాల్చి తీయాలి. అంతే నోరూరించే ఆలూ పెప్పర్ బఠాణీ రెడీ.