కావలసిన పదార్థాలు : బియ్యం... అర కేజీ పాలకూర... ఆరు కట్టలు ఉల్లిపాయలు... వంద గ్రా. అల్లం వెల్లుల్లి ముద్ద... ఒకటిన్నర టీ. కొత్తిమీర... ఒక కట్ట పచ్చిమిర్చి... నాలుగు ఎండు మెంతికూర... మూడు టీ. గరంమసాలా... ఒక టీ. డాల్డా... వంద గ్రా. ఉప్పు... తగినంత పసుపు... పావు టీ.
తయారీ విధానం : ఒక గిన్నెలో డాల్డా వేసి, స్టవ్మీద పెట్టి కరిగించాలి. తరువాత అందులో గరంమసాలా వేయాలి. ఆపై ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారువర్ణంలోకి మారగానే అల్లంవెల్లుల్లి, పసుపు వేసి మరికాసేపు వేయించాలి.
ఇప్పుడు శుభ్రంగా కడిగి కోసిన పాలకూరను కూడా వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. తరువాత అందులోనే ఒక లీటర్ నీటిని పోసి మరిగించాలి. ఆపై బియ్యాన్ని వేసి పూర్తిగా ఉడికిన తరువాత ఎండు మెంతికూర పొడి వేసి దించేయాలి. అంతే పాలక్ రైస్ రెడీ అయినట్లే...!