కావలసిన పదార్థాలు : జామకాయలు... ఒక కిలో ఉల్లిపాయలు... 200 గ్రా. అల్లంవెల్లుల్లి... 4 టీ. ఎండుమిర్చి... ఎనిమిది జీడిపప్పు... 50 గ్రా. పెరుగు... ఒక కప్పు టొమోటోలు... అర కిలో నూనె... 150 గ్రా. గరంమసాలా... అర టీ. కారం... రెండు టీ. పచ్చిమిర్చి... 4 కొత్తిమీర... రెండు కట్టలు ఉప్పు... తగినంత
తయారీ విధానం : జీడిపప్పును ముద్దగా నూరాలి. బాణలిలో నూనె వేసి గరంమసాలా, ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి దగ్గరగా ఉడికిన తరవాత వాటన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అదే బాణలిలో కాస్త నూనె వేసి అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాక.. టొమాటో గుజ్జు, కారం, జీడిపప్పు ముద్ద వేసి బాగా కలపాలి.
చివరగా పెరుగు వేసి కలిపి ఉప్పు సరిచూడాలి. జామకాయల్ని ముక్కలుగా కోసి గింజల్ని తీసేయాలి. ఉప్పు, పసుపు, కారం వేసిన నీళ్లలో 5 నిమిషాలు ఉడికించాలి. ముక్క మెత్తబడగానే నీళ్లు వంపేసి, ఆ ముక్కల్ని పైన తయారు చేసిన కూర మిశ్రమంలో వేసి కలిపి 5 నిమిషాలపాటు ఉడికించాలి. అంతే జామకాయల సబ్జీ సిద్ధమైనట్లే... దీన్ని వేడివేడిగా చపాతీలతోపాటు తింటే చాలా రుచిగా ఉంటుంది.