కావలసిన పదార్థాలు : బెంగళూరు టొమోటోలు.. పది దేశవాళీ టొమోటోల గుజ్జు... నాలుగు కప్పులు ఉల్లిపాయముద్ద... ఒక కప్పు కారం... రెండు టీ. పసుపు... ఒక టీ. అల్లంవెల్లుల్లి... రెండు టీ. జీడిపప్పుముద్ద... అర కప్పు కసూరిమేతి.. రెండు టీ. నూనె... అర కప్పు ఉప్పు... తగినంత గరంమసాలా... అర టీ. పెరుగు... ఒక కప్పు
తయారీ విధానం : ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి బెంగళూరు టొమోటో (కాయ మొత్తాన్ని)లను వేసి రెండువైపులా వేయించి తీసేయాలి. ఇప్పుడు ఆ టొమోటోలకు తొక్క తీసి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిముద్ద వేసి దోరగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కలియబెట్టాలి. టొమోటో గుజ్జును కూడా కొద్ది కొద్దిగా వేస్తూ బాగా వేయించాలి.
ఇప్పుడు అందులోనే పెరుగు, తగినన్ని నీళ్లుపోసి పచ్చివాసన పోయేంతదాకా ఉడికించాలి. దాంట్లోనే జీడిముద్దను కూడా వేసి ఉడికించాలి. చివరగా బెంగళూరు టొమోటోలను, కసూరిమేతిని వేసి కలియబెట్టి, గరంమసాలా చల్లి, ఉప్పు సరిజూసి... కాసేపటి తరువాత దించేయాలి. అంతే టొమోటో ముస్సలం తయారైనట్లే...!