కావలసిన పదార్థాలు : శనగపప్పు... అర కిలో ఉల్లిపాయలు... నాలుగు పచ్చిమిర్చి.... పది కారం... రెండు టీ. కొత్తిమీర... అర కప్పు కరివేపాకు... అర కప్పు అల్లం... చిన్న ముక్క నూనె... వేయించేందుకు సరిపడా ఉప్పు... తగినంత
తయారీ విధానం : రెండు గంటలముందే శెనగపప్పును నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లన్నీ వంపేసి పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఉప్పు అన్నీ చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమానికి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు చేర్చి, బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక, పిండిని పకోడీల మాదిరిగా వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే శెనగపప్పు కరివేపాకు పకోడీలు తయారయినట్లే...!