ఒకేసారి 200 మంది మోడళ్ల నగ్న ఫోటో షూట్‌... డెడ్‌ సీ వద్ద..?

సోమవారం, 18 అక్టోబరు 2021 (13:34 IST)
ఒకేసారి 200 మంది మోడళ్లు నగ్నంగా ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ ఫోట్‌ షూట్‌ ఇజ్రాయిల్‌లోని డెడ్‌ సీ వద్ద చేశారు. ప్రముఖ ఆర్టిస్ట్ స్పెన్సర్‌ టునిక్‌ ఈ ఫొటో షూట్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయిల్‌ దేశంలో నీటి సమస్య రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా డెడ్‌ సీలోని ఏడారి ప్రాంతంలోని భూగర్భంలో నీరు తరిగిపోతోంది. అక్కడి పౌరులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీటిపై అవగాహన కల్పించేందుకు మోడళ్లు నగ్నంగా ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్‌ స్పెన్సర్‌ ఆదేశాలకు అనుగుణంగా మోడళ్లు అందరూ శరీరానికి తెల్లని రంగు పూసుకొని ఫొటోలు దిగారు.
 
ఈ కార్యక్రమాన్ని ఇజ్రాయిల్‌ టూరిజం వింగ్‌ చేపట్టింది. గతంలో 1000 మంది మోడళ్లతో నగ్నంగా డెడ్‌ సీ వద్ద ఫొటో షూట్‌ చేశాడు ట్యునిక్. ప్రతి సంవత్సరం డెడ్‌ సీలోని నీరు ఓ మీటరు మేర ఎండిపోతున్నది.
 
 మైనింగ్‌ సమస్యతో పాటు ఇజ్రాయిల్‌, జోర్డాన్‌లు వ్యవసాయం కోసం ఎగువ ప్రాంతాల్లో నీటిని మళ్లీస్తుండడంతో ప్రతి ఏటా డెడ్‌సీలో నీరు తరిగిపోతూ వస్తోంది. దీనికి స్థానిక వాతావరణ సమస్యలు కూడా తోడయ్యాయి. 
 
అయితే మోడళ్లకు తెల్లని రంగు వేయడం వెనుక గల కారణాన్ని ఫొటో గ్రాఫర్‌ ట్యునిక్‌ తెలిపాడు. ఓ బైబిల్‌ కథ ప్రకారం.. ఓ వ్యక్తి భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుందని, దానిని దృష్టిలో పెట్టుకొనే మోడళ్లకు తెలుపు రంగు వేశామని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు