తనను ఆర్థిక నేరగాడు, పారిపోయిన దొంగ అంటూ కామెంట్స్ చేస్తే మొహం పగలగొడతానని స్వదేశీ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా హెచ్చరించాడు. ఈ మేరకు ఆయన ఆయన ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్ను వీడానని పేర్కొన్నారు. తానేమీ దొంగతనం చేయలేదన, అసలు దొంగతనం ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. తాను భారత్ నుంచి పారిపోయానని, కానీ దొంగను మాత్రం కాదని చెప్పారు.
భారత్ నుంచి వెళ్లిపోయినందుకు నన్ను దేశం నుంచి పారిపోయిన వ్యక్తి అని పిలవండి. కానీ, దొంగ అని ముద్ర వేయకండి. ముందస్తు ప్రణాళికలో భాగంగానే 216 నేను భారత్ నుంచి విదేశాలకు వెళ్లాను. కొన్ని కారణాల వల్ల తిరిగి రాలేకపోయాను. ఈ దొంగతనం అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది. భారత్లో న్యాయమైన విచారణ. గౌరవప్రదమైన జీవితం ఉంటుందని ఎక్కడ నుంచి వచ్చింది. భారత్లో న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవింతం ఉంటుందని హామీ ఇస్తే దేశానికి తిరిగి వచ్చే విషయం గురించి ఆలోచించేవాడిని. కానీ, ఆ విధంగా ఉండదని నాకు తెలుసు అని మాల్యా అన్నారు.