ఈ వ్యక్తికి పాక్ రాయబార కార్యాలయం అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డాన్ష్తో సింగ్కు సంబంధాలున్నాయని, డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ జాతీయ దినోత్సవంలో కూడా సింగ్ పాల్గొన్నాడని తెలిసింది.
ఇంకా అక్కడ పాకిస్థాన్ ఆర్మీ ఆధికారులు, వ్లోగర్లను సింగ్ కలుసుకున్నాడని విచారణలో తేలింది. అంతేగాకుండా.. 2020, 2021, 2024లో మూడు సందర్భాల్లో జస్బీర్ సింగ్ పాకిస్థాన్కు వెళ్లాడని, ఆయనకు పాకిస్థాన్ బేస్డ్ కాంటాక్టులు ఉన్నట్టు అతని వద్ద స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ తెలిపారు.