హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న సొరంగాలను పేల్చేశారు..

బుధవారం, 1 నవంబరు 2023 (14:36 IST)
గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడిలో హమాస్ కమాండర్‌తో పాటు పలువురు ఉగ్రవాదులు మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న సొరంగాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేల్చివేసింది. 
 
హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీ ఐడీఎఫ్ వైమానిక దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 7 దాడికి బాధ్యులైన హమాస్ సీనియర్ కమాండర్‌ను తమ ఫైటర్ జెట్‌లు హతమార్చాయని ఐడీఎఫ్ తెలిపింది. 
 
గాజాలో ఉగ్రవాదులు దాక్కున్న సొరంగాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వైమానిక దాడుల్లో కమాండర్ బియారీతో పాటు 50 మంది పాలస్తీనియన్లు మరణించారు. బియారీ తరహాలో భూగర్భ సొరంగం కాంప్లెక్స్‌లో ఉన్నప్పుడు డజన్ల కొద్దీ హమాస్ మిలిటెంట్లు దాడి చేసి చంపబడ్డారని ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కన్రికస్ తెలిపారు. 
 
గాజా స్ట్రిప్‌లోని అతిపెద్ద శరణార్థుల శిబిరంలో కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారని, 150 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు మరియు క్షిపణులను ప్రయోగించామని యెమెన్ హౌతీలు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు