ఇజ్రాయేల్‌లో 493,000 మంది మహిళలు అధోగతే!

శనివారం, 21 అక్టోబరు 2023 (09:27 IST)
ఇజ్రాయేల్‌లో దాదాపు 493,000 మంది మహిళలు, బాలికలు ఇప్పటికే గాజాలో తమ ఇళ్లను విడిచిపెట్టారు. అదనంగా, ఈ హింస విషాదకరంగా వితంతువుల సంఖ్య పెరగడానికి దారితీసిం. పురుషులు గాజా దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో 900 మంది మహిళలు కుటుంబ పెద్దలుగా మారారు. 
 
దీనిపై యూఎన్ మహిళా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా హెండ్రిక్స్ మాట్లాడుతూ.. "గాజాలోని మహిళలు, బాలికల మనుగడకు కీలకమైన ఆహారం, నీరు, ఇంధనం, ఆరోగ్య సామాగ్రితో సహా మానవతా సహాయం కోసం తక్షణ మానవతావాద కాల్పుల విరమణ, అడ్డంకిలేని యాక్సెస్ కోసం UN మహిళలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభానికి ప్రతిస్పందించాలని కోరారు. 
 
ప్రస్తుత సంక్షోభానికి ముందు కూడా, గాజాలో పరిస్థితి నిరాశాజనకంగా ఉందని, 97 శాతం మంది పురుషులు, 98 శాతం మంది మహిళలు తమ భద్రత గురించి భయపడుతున్నారని ఏజెన్సీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు