భారతీయుల తరలింపునకు ఆపరేషన్ దేవిశక్తి

మంగళవారం, 24 ఆగస్టు 2021 (14:47 IST)
ఆప్ఘనిస్థాన్ దేశం తాలిబన్ తీవ్రవాదుల వశమైంది. దీంతో ఆ దేశంలోని ఆప్ఘన్ పౌరులతో పాటు.. ఇతర దేశాలకు చెందిన పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ రాజ‌ధాని కాబూల్‌లోని విమానాశ్ర‌యం నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు భార‌త్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆప‌రేష‌న్ దేవిశ‌క్తి పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తుంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ట్వీట్ చేశారు.
 
ఈ రోజు భార‌తీయులు స‌హా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి త‌జ‌కిస్థాన్‌లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఆప‌రేష‌న్ చేప‌డుతోన్న భార‌త వైమానిక సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి కొన‌సాగుతోంద‌ని చెప్పారు. దుషన్బే నుంచి భార‌త్ కు 25 మంది భార‌తీయులు స‌హా 78 మంది విమానంలో బ‌య‌లుదేరిన వీడియోను ఓ అధికారి పోస్ట్ చేశారు. 
 
మరోపక్క, ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌సిద్ధ గ‌జిని ప్రావిన్స్ గేటును తాలిబ‌న్లు కూల్చివేశారు. ఇందుకు స‌బంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాగే, కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం ఒకటి హైజాక్‌కు గురైంది. 


 

Helping in the safe return from Afghanistan.
AI 1956 enroute to Delhi from Dushanbe carrying 78 passengers, including 25 Indian nationals. Evacuees were flown in from Kabul on an @IAF_MCC aircraft.@IndEmbDushanbe pic.twitter.com/BcIWLzSLrL

— Arindam Bagchi (@MEAIndia) August 24, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు