ప్రధాని మోదీకి, భారత ఎంబసీకి థ్యాంక్స్ చెప్పిన పాక్ బాలిక (video)

బుధవారం, 9 మార్చి 2022 (14:03 IST)
Pak Girl
రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించటానికి భారత్ ప్రభుత్వం 'ఆపరేషన్ గంగ'ను చేపట్టిన విషయం తెలిసిందే. అలా ఇప్పటికే వేలాదిమంది విద్యార్దులతో సహా భారతీయుల్ని తరలించింది భారత ప్రభుత్వం. 
 
ఈ క్రమంలో భారత్‌కు సరిహద్దు దేశం, దాయాది దేశమైన పాకిస్థాన్‌కు చెందిన బాలికను కూడా భారత్ ఎంబసీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. దీంతో సరు పాకిస్థాన్ బాలిక ప్రధాని మోదీకి, భారత రాయబారకార్యాలయానికి ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో యుక్రెయిన్ లోని కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన ఆ బాలిక పేరు ఆస్మా షఫీక్. ఆ వీడియోలో బాలిక మాట్లాడుతూ.. కీవ్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపింది.

#WATCH | Pakistan's Asma Shafique thanks the Indian embassy in Kyiv and Prime Minister Modi for evacuating her.

Shas been rescued by Indian authorities and is enroute to Western #Ukraine for further evacuation out of the country. She will be reunited with her family soon:Sources pic.twitter.com/9hiBWGKvNp

— ANI (@ANI) March 9, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు