వియత్నాంలో రైస్ ఏటీఎంలు

మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (14:10 IST)
కరోనా సంక్షోభం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో చిన్న దేశమైన వియత్నాం కూడా లాక్ డౌన్ అయిపోయింది. దీంతో దినసరి కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే అలాంటి వాళ్ల ఆకలి తీర్చేందుకు హో చి మిన్ సిటీకి చెందిన హోంగ్ తువాన్ అన్ అనే వ్యాపారి కొత్త ప్రయత్నంతో ముందుకొచ్చారు.

నగరంలో ఉచితంగా బియ్యం పంచేందుకు రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేయించారు. ఏటీఎం నుంచి ఒక్కోసారి 1.5 కిలోల బియ్యం వస్తాయి. వియత్నాంలోని హనోయి, హూ, డనాంగ్ అనే నగరాల్లోనూ ఇలాంటి రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.

వియత్నాంలో కేవలం 265 కరోనా కేసులే నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరూ కూడా చనిపోలేదు. అయినా ముందుజాగ్రత్తగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు