మాజీ మిస్ వరల్డ్ యుమారా లోపేజ్(22) కన్నుమూశారు. గతకొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్తో నరకాయాతం అనుభవిస్తున్న ఆమె నికరాగువా రాజధాని మనాగువాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2014లో లండన్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో యుమారా విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన కొద్ది రోజులకే ఆమెకు బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసి నివ్వెరపోయింది.
విపరీతమైన తలనొప్పి, కళ్లు సరిగా కనిపించకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా... బ్రెయిన్ క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటికే క్యాన్సర్ రెండో స్టేజ్లో ఉండటంతో మృత్యువుతో పోరాడుతూ యుమారా తుది శ్వాస విడిచింది.