ఇప్పటివరకు మనం హాలీవుడ్ సినిమాలలో మాట్లాడే కారును చూసాం. కాని ఇప్పుడు అదే మాట్లాడేకారు మార్కెట్లోకి రానుంది. దీనిని రూపొందించిన కర్తలు మన భారతీయులే. వీరు రెండు కార్ల మధ్య మాట్లాడేటటువంటి ఎల్గోరిథమ్ను జోడించనున్నామని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ పసిఫిక్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్.బీ. శర్మ మరియు డాక్టర్. ఉతేష్ చంద్ర నేతృత్వంలో ఈ మాట్లాడే కారును రూపొందించనున్నారు. ఇది రోబోటిక్ కార్లను సురక్షితమైన విధానంతో లైన్ మార్చే ప్రక్రియకు పూనుకుంటాయి.
తాము రూపొందించే రోబోటిక్ కార్లకు ఎప్పుడు లైన్ కలుపుకోవాలో సూచనలు అందుతాయని డా. శర్మ అన్నారు. దీంతో మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలను ముందుగానే పసిగట్టి డ్రైవర్కు సూచనలు ఇస్తాయని ఆయన అన్నారు. ఇంతే కాకుండా ప్రయాణం చేసేటప్పుడు వాహనంయొక్క వేగాన్నికూడా తెలుపుతుందని ఆయన పేర్కొన్నారు.
తాము రూపొందించే ఈ కారులో ఫ్లోకింగ్ రోబోటిక్స్లో ప్రయోగించే ఒక ప్రత్యేకమైన బయోలాజికల్ సాంకేతిక తత్వాన్ని ఇందులో పొందుపరచడం ఓ మార్పని ఆయన తెలిపారు. ఫ్లోకింగ్ను ఉపయోగించడంమూలాన రోబోట్లు పరస్పరం మాట్లాడుకుంటాయని దీంతో సుదూర ప్రయాణంలో అలసటంటూ రాదని ఆయన తెలిపారు.
రోబోటిక్స్ కార్లన్నికూడా ఎల్గారిథమ్తో అనుసంధానమై ఉంటాయని దీంతో కార్ల మధ్య మంచి అవగాహన ఉంటుందని ఆయన వివరించారు.