Reliance Jio: 14 రోజులపాటు అపరిమిత 5జీ డేటా

సెల్వి

మంగళవారం, 20 ఆగస్టు 2024 (20:03 IST)
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. ఇటీవల టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచడంపై కస్టమర్లు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎక్కువ డేటా వాడే వినియోగదారుల కోసం జియో అందిస్తున్న ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. 
 
కొత్తగా రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌‌ను ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. 14 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఆఫర్ కింద అర్హులైన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు.
 
జియో అందిస్తున్న చౌకైన ఆఫర్లలో ఈ ప్లాన్ ఒకటిగా ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్‌, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు రోజుకు 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో యాప్‌ సర్వీసులు కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా యాప్‌ సేవలు లభిస్తాయి.
 
కాగా రూ.198 రీఛార్జ్ ప్లాన్‌తో సమానమైన సేవలను 28 రోజులపాటు పొందాలనుకుంటే రూ.349 ప్లాన్‌ను రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు