ఇంగ్లీష్‌లోనే మాట్లాడే స్నేహితుడిని 54సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.. ఎందుకు?

శుక్రవారం, 23 మార్చి 2018 (14:29 IST)
ఇంగ్లీషులో మాట్లాడి వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ వహిద్ రహీన్ (21), అలామ్ షేక్ స్నేహితులు. వీరిలో రహీన్ పెద్దగా చదువుకోలేదు. అయితే షేక్ చదువుకున్న వాడు. 
 
ఎప్పుడు మాట్లాడినా ఆంగ్లంలోనే మాట్లాడేవాడు. చదువురాని వ్యక్తి అయిన రహీన్‌ను హేళన చేసేవాడు. ఇంగ్లీష్ రాదని వేధించేవాడు. రహీన్ ఎంత ఓపిగ్గా సహించాడు. కానీ షేక్ ఇదే తంతును కొనసాగించడంతో ఇక లాభం లేదనుకున్నాడు. ఆత్మన్యూనతతో కసి పెంచుకున్నాడు. షేక్‌ను హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. 
 
అదను చూసి ప్లాన్ ప్రకారం మద్యం తాగిన తర్వాత షేక్‌ను హసీన్ 54సార్లు కత్తితో పొడిచి చంపేశారు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహీన్‌ను రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు