కాటేసిన పాము... : బాలికను బతికిస్తానని పేడ కప్పి, వేపకొమ్మలతో పూజలు

గురువారం, 10 ఆగస్టు 2023 (15:25 IST)
ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ మంత్ర, తంత్రాల వైద్యాలపై జనం నమ్మకాలు తగ్గట్లేదు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌ జిల్లా థానాకాంట్‌ సమీప గ్రామంలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. మంగళ్‌సింగ్‌ కుటుంబం ఆదివారం రాత్రి తమ గుడిసెలో నిద్రపోతుండగా.. ఆరేళ్ల కుమార్తెను పాటు కాటేసింది. కుటుంబసభ్యులు ఆ బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించకుండా భూతవైద్యం ద్వారా కాపాడేందుకు ప్రయత్నించారు. 
 
పరిస్థితి విషమించాక ఆఖరులో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు షాజహాన్‌పుర్‌ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా.. ఆమె బతికే ఉందని భూతవైద్యుడు నమ్మబలికాడు. ఆవు పేడను శరీరంపై కప్పమని.. చుట్టూ వేపకొమ్మలను ఉంచమని చెప్పాడు. ఈ పూజల సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని, మంగళ్‌సింగ్‌ కుటుంబానికి నచ్చజెప్పి.. అంత్యక్రియలకు ఏర్పాట్లుచేయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు