ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై గురువారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇరాన్ ముందస్తు చర్యల్లో భాగంగా, తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత్కు చెందిన ఎయిరిండియా విమానాలను దారి మళ్లించారు. ఇరాన్ గగనతలం మూసివేయడంతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఏఐ131ను అత్యవసరంగా దారి మళ్లించాల్సివచ్చింది. అలాగే, మరో 15 విమానాలను కూడా ఎయిరిండియా దారి మళ్లించడమో, వెనక్కి పిలిపించడమే చేసినట్టు సమాచారం.
షెడ్యూల్ ప్రకారం నేడు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిరిండియా విమానం సాధారణంగా ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంది. అయితే, ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్య నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా తమ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపింది.