ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా

ఠాగూర్

శుక్రవారం, 13 జూన్ 2025 (09:21 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన 241 మంది చనిపోయారని ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్‌ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిరిడియాకు చెందిన బోయింగ్ ఏఐ171 రకం విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే జనావాస ప్రాంతాలపై కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మందిలో 241 మంది చనిపోయారని, ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అదృష్టవశాత్తు ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. 
 
కాగా, 12 యేళ్లనాటి బోయింగ్ 787-8 డ్రీమ్ విమానం గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. 
 
వీరిలో 139 మంది భారత పౌరులు కాగా, 53 మంది బ్రిటీష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ వారు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో సజీవంగా బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటీష్  జాతీయుడుని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎయిరిండియా పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు